హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హనుమంతరావు, ప్రధానకార్యదర్శిగా నవాత్ సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సంఘం రాష్ట్ర ఎన్నికలు హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించారు.
2022 -25 సంవత్సరానికిగాను వీరిని ఎన్నుకొన్నారు. రాష్ట్ర సహాధ్యక్షులుగా ఏ నరేందర్రావు, ఏ పాపిరెడ్డి, బీ ఉషారాణి, సహ ప్రధాన కార్యదర్శులుగా బండి రమేశ్, టీ పెంటయ్య, రామకృష్ణారెడ్డి, కోశాధికారిగా లక్ష్మీకాంతారావు ఎన్నికయ్యారు.