హనుమకొండ: హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2004 ఎన్నికల్లో మందాడి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున హనుమకొండ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.