హనుమకొండ, నవంబర్ 4: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవే ట్ ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందు కు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం హనుమకొండ ఎన్జీవోస్ కాలనీలోని ఎస్వీ కన్వెన్షన్లో విద్యావంతుల ఆత్మీ య సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, ఉపాధ్యాయు లు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న వినోద్కుమార్ మా ట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రైవేటు ఉపాధ్యాయుల సంరక్షణ చట్టం కోసం ప్రయత్నించానని, రాబోయే రోజుల్లో ఈ దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ బాసర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చీఫ్ విప్ దాస్యం విన య్ బాసర్ మాట్లాడుతూ.. కరోనా కష్ట కా లంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా నిలిచానని గుర్తుచేశారు. ప్రతి ఉపాధ్యాయుడు తన గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమ్మేళనంలో కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.