హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒంటిపూట నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులను నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యా హ్నం 12.30 గంటలకు అందజేస్తారు. ఎస్సెస్సీ పరీక్షల సమయంలో పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు.