హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): చాకలి ఐలమ్మ వర్ధంతిని ఆదివారం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ తెలిపారు. వర్ధంతిలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో గుర్తింపునకు నోచుకోని పోరాట యోధులు, వీరయోధులను ప్రభుత్వం గుర్తిస్తున్నదని కొనియాడారు. అందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.