హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికుల(హాజీలు)కు మెరుగైన సేవలందించాలని వలంటీర్లకు హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ సూచించారు. ఆదివారం నాంపల్లిలోని హజ్హౌస్లో వలంటీర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వలంటీర్ల విధుల గురించి సలీమ్ వివరించారు. హజ్ యాత్రికులకు వలంటీర్గా ఉండటం గొప్ప విషయమని తెలిపారు. యాత్రికులకు అన్ని విధాలుగా సహాయకారిగా ఉండాలని చెప్పారు. హజ్ క్యాంప్ ఆపరేషన్స్-2023 సజావుగా కొనసాగేలా చూడాలని వలంటీర్లకు సూచించారు. సమావేశంలో హజ్కమిటీ ఏఈఈవో ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.