TS TET | డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ నిర్వహించడం వల్ల రాష్ట్రంలోని 7 లక్షలకు పైగా విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. టెట్ నిర్వహించాలని ఈ నెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తరఫున తాను లేఖ రాశామని తెలిపారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడమం సంతోషకరమని అన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు.
టెట్ నిర్వహణ జరగకపోవడం వల్ల రాష్ట్రంలో 7 లక్షల పై చిలుకు విద్యార్థులు డీఎస్సీ పరీక్షకు అర్హత కోల్పోతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ, టెట్ నిర్వహించాలని ఈనెల 12న… pic.twitter.com/wtDrlGNsJ4
— Harish Rao Thanneeru (@BRSHarish) March 14, 2024