China | హైదరాబాద్, జనవరి 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుకకు చైనానే కారణమంటూ అనుమానాలు కొనసాగుతున్న సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్పై (జీఎక్స్_పీ2వీ) చైనాకు చెందిన పరిశోధకులు ఓ రహస్య ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డ కథనాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ వైరస్ సోకితే మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్టు తెలియడం ఆందోళన కలిగిస్తున్నది.
ఐదురోజుల్లో నడవలేని దుస్థితికి
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కరోనాకు కారణమైన సార్స్-కొవ్-2 రకానికి చెందిన జీఎక్స్_పీ2వీ అనే ఉపరకంపై చైనా పరిశోధకులు రహస్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో 2017లో గుర్తించిన జీఎక్స్కు మ్యుటేషన్గా ఈ వైరస్ను భావిస్తున్నారు. రహస్య ల్యాబ్లో ఈ వైరస్ను తొలుత కొన్ని ఎలుకలపై పరిశోధకులు ప్రయోగించినట్టు తెలుస్తున్నది. ఈ వైరస్ ప్రభావంతో ఎలుకల ఊపిరితిత్తులు, కండ్లు, ఎముకలు, శ్వాసనాళం, మెదడు పూర్తిగా దెబ్బతిని కేవలం ఐదురోజుల్లోనే అవి నడవలేని స్థితికి చేరినట్టు సమాచారం. అత్యంత బలహీనంగా మారిన ఆ ఎలుకలు వైరస్ ప్రభావానికి గురైన ఎనిమిది రోజుల్లోనే మరణించినట్టు నివేదికలు వెల్లడించాయి. ఒకవేళ ఈ వైరస్ మనుషులకు సోకినైట్లెతే, దాదాపుగా ఇవే లక్షణాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో జనాభా క్షీణత
ఒకప్పుడు జనాభాలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న చైనాలో ఇప్పుడు జనాభా సంఖ్య ఏటికేడు తగ్గుతుండటంతో పాలకుల్లో ఆందోళన నెలకొంది. ఆ దేశంలో వరుసగా రెండో ఏడాది కూడా జనాభా తగ్గుదల నమోదైంది. గత ఏడాది జనాభా అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే 20.08 లక్షలు తగ్గి 140.97 కోట్లకు చేరింది. కాగా, ప్రపంచ జనాభా సంఖ్యలో గత ఏడాదే భారత్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించిన సంగతి తెలిసిందే.