నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నాగర్ కర్నూల్ టికెట్ బీఎస్పీకి ఇవ్వడాన్ని స్వాగతి స్తున్నామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ గువ్వల బాలరాజు(Guvvala Balaraju) అన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తూ బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ (BRS-BSP) కలిసి పోటీ చేయనున్నాయి.
ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయిం చాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాగర్కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ పోటీచేయనుంది. ఇప్పటికే 11 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.