Guvvala Balaraju | నాగర్కర్నూల్ : ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణం సమాజానికి తీరని లోటని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో శుక్రవారం సాయిచంద్ సంతాపసభ నిర్వహించారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విప్ గువ్వల, ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ తమకు దేవుడు ఇచ్చిన తమ్ముడు సాయిచంద్ అని, ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తామని కలలో కూడా అనుకోలేదన్నారు. సాయిచంద్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సాయిచంద్ కూతురు పేరిట రూ.21లక్షలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కవి, గాయకుడు సురేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత బైకాని శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.