చిట్యాల, ఫిబ్రవరి 28 : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల ఉన్నత పాఠశాలలో 1669-70లో పదోతరగతి చదివిన తన చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే ఉద్దేశంతో గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం చిట్యాల మండలం ఉరుమడ్లలోని తన నివాసంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు.
53 సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి మిత్రులను పేరుపేరున పలుకరించి ఆత్మీయతను చాటుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. చనిపోయిన తమ ముగ్గురు మిత్రుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. మండలి చైర్మన్ తన హోదాను మరిచి అందరితో కలుపుగోలుగా ఉండటంతో మిత్రులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.