నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆయనపై ప్రజల ప్రేమాభిమానాలు చెక్కుచెదరలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలను ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న అంశాలు, పరిస్థితులే ప్రభావితం చేశాయని అన్నారు. అందుకే ఒక్కో జిల్లాలో ఒక్కో విధమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.
నల్లగొండలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీలో ప్రజలు కేసీఆర్ సర్కార్ను కోరుకున్నారని, మెదక్లోనూ బీ ఆర్ఎస్వైపే నిలిచారని గుర్తు చేశారు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో ప్రజ ల్లో మిశ్రమ స్పందన కనిపించిందని చెప్పారు. నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్లో మార్పు కోరినట్టుగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. తాను గతంలో ఎన్నడూ ఇలాంటి అంతుచిక్కని ఫలితాలను చూడలేదని, కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకే ప్రజలు ఓట్లేసినట్టు తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు.
తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కల్పించిన గౌరవంతో రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్ పదవిలో తాను ఉన్నానని, చట్టబద్ధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని తెలిపారు. పార్టీలకు అతీతంగా చైర్మన్ స్థానం గౌరవాన్ని నిలబెడు తూ ప్రభుత్వానికి అవసరం అయిన సలహాలు, సూ చనలు అందిస్తానని చెప్పారు. ప్రతీ విషయంలోనూ సోషల్ మీడియా గందరగోళం సృష్టిస్తున్నదని, ఇ లాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దని కోరారు.