హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్, దండే విఠల్, నవీన్ కుమార్, రఘోత్తం రెడ్డి, శాసన సభ కార్యదర్శి డాక్టర్ నరసింహా చార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్ రెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.