హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మొదటి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటా రు. మొత్తం 98 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించడం గర్వకారణం. కాళోజీ నారాయణరావు వైద్యశాస్ర్తాల వర్సిటీ నిర్వహించిన తొలిరౌండ్ మెడికల్ కౌన్సెలింగ్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కి చెందిన 94 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించారు. సర్కారు అందిస్తున్న దన్నుతో పేదరికాన్ని జయించి వైద్యవిద్య కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశారు.
గతేడాది 236 ఎస్సీ గురుకుల విద్యార్థులు వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందగా ఈసారి మొదటి విడతలోనే 94 మంది సీట్లను సాధించడం విశేషం. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన విద్యార్థి మోహన్, ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మనోజ్కుమార్ గాంధీ మెడికల్ కాలేజీలో సీట్లను సాధించగా మిగతా విద్యార్థులు వివిధ కళాశాల్లో సత్తా చాటారు. మైనార్టీ గురుకులాలకు చెందిన నలుగురు విద్యార్థులు తహురా మసూద్, సైఫుద్దీన్, రాంబాబు, శ్రవణ్కుమార్ ఎంబీబీఎస్ సీట్లను పొందారు. విద్యార్థులను మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ సెక్రటరీలు రోనాల్డ్ రోస్, షఫియుల్లా ప్రత్యేకంగా అభినందించారు.