హైదరాబాద్, ఫిబ్రవరి29 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) గురువారం సాయంత్రం విడుదల చేసింది. ప్రస్తుతం టీజీటీ పోస్టుల ఎంపికకు ట్రిబ్ కసరత్తు చేస్తున్నది.