1,34,478 మంది విద్యార్థులు హాజరు
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన వీటీజీ సెట్ 2022 పరీక్ష సాఫీగా ముగిసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 415 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. 46,120 సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,47,924 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1,34, 478 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
గత ఏడాది 74,052 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ సారి అంతకు రెట్టింపు స్థాయిలో దరఖాస్తు చేసుకోవడంతోపాటు వారిలో 90.91 శాతం మంది పరీక్షకు హాజరవడం విశేషం. పరీక్షను పకడ్బందీగా నిర్వహించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్రోస్తోపాటు అన్ని సొసైటీలకు చెందిన అధికారులను, సిబ్బందిని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు.