గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహరాజ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు ప్రారంభించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అరుణాచలం తరహాలో కొండగట్టులో ఈ కార్యక్రమాన్ని మూడోసారి నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. గిరిప్రదక్షిణలో ఎమ్మెల్యే దంపతులు కాసేపు పాల్గొని తర్వాత స్వామివారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు.
-మల్యాల