హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగా ణ): విద్యార్థుల భవితతో గురునానక్, శ్రీనిధి కాలేజీలు ఆటలాడుకుంటున్నాయి. సొంత వి ద్యార్థులను చేర్చుకునేందుకు ససేమిరా అం టున్నాయి. గురునానక్, శ్రీనిధి వర్సిటీలను ఏర్పాటు చేస్తూ 13 సెప్టెంబర్ 2022లో అ సెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. అయితే, ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో వర్సిటీలు ఏర్పాటు కాలే దు. మరోవైపు, బిల్లు ఆమోదం పొందగానే ఈ వర్సిటీలు విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకున్నాయి. ఏడాది గడిచినా గవర్నర్ అనుమ తి రాకపోవడంతో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారి భవిష్యత్తుపై దృష్టిసారించిన ప్రభుత్వం వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, ఓయూ వీసీ రవీందర్ నేతృత్వంలో కమిటీ వేసింది.
శ్రీనిధి వర్సి టీ విద్యార్థులను అదే విద్యా సంస్థ నిర్వహిస్తున్న శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ లో, గురునానక్ వర్సిటీలోని ఇంజినీరింగ్, ఎంబీఏ విద్యార్థులను అదే వి ద్యా సంస్థ నడుపుతున్న కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఇందుకోసం యాజమాన్య కో టా సీట్లను రద్దుచేసింది. ఎంసీఏలో సగం మంది విద్యార్థులను ఓయూలో, మిగతా వారిని జేఎన్టీయూ, బీసీఏ విద్యార్థులను ఓయూలో సర్దుబాటు చే యాలని సూచించింది. బీఎస్సీ, బీపీటీ, బీకాం, బీబీఏ వంటి కోర్సుల్లోని విద్యార్థులను మల్లారెడ్డి, అనురాగ్ వర్సిటీలకు బదలాయించాలని కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ యథాతథంగా ఆమోదిస్తూ ఉత్తర్వులిచ్చినా ఈ రెండు విద్యాసంస్థలు పెడచెవిన పెట్టాయి. గురునానక్ కాలేజీ యాజమాన్యం కొంతమంది విద్యార్థులను తీసుకునేందుకు ముందుకు రాగా, శ్రీనిధి కాలేజీ అస్సలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 3న మరోమారు నలుగురు సభ్యుల కమిటీ సమావేశమై తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి పంపించనున్నది.