జహీరాబాద్ : కర్ణాటక తెలంగాణ పోలీసులు సమన్వయంతో పనిచేసి నేరాలు అదుపు చేసేందుకు కృషి చేయాలని గుల్బర్గా అదనపు ఏఎస్పీ శ్రీనిధి అన్నారు. శనివారం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో రెండు రాష్ట్రాల పోలీస్ అధికారులతో నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలు ఉన్నందున తెలంగాణ పోలీసులు తమకు సహకరించి నేరాలు అదుపు చేసినందుకు కృషి చేయాలి కోరారు. నేరస్తుల సమాచారాన్ని పరస్పరం తీసుకొని నేరాలు అదుపు చేయాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందినప్పుడు వారి సమాచారాన్ని షేర్ చేసుకుని మృతుల వివరాలు తెలుసుకోవాలన్నారు. పలు అంశాలపై పోలీసు అధికారులకు సూచన చేశారు. ఈ సమావేశంలో చించోలి డీఎస్పీ ఉజన్నప్ప, జహీరాబాద్ పట్టణ సీఐ తోట భూపతి సంగారెడ్డి, డీసీఆర్బీ సీఐ రమేశ్తో పాటు పాటు చిరాకుపల్లి ఎస్ఐ కాశీనాథ్, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.