అది ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. పైగా ఎరువుల తయారీ పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం. అయినా అక్కడ ఎరువుల కొరత రైతుల్ని వేధిస్తున్నది. గుజరాత్లో యూరియా కోసం అన్నదాతలు తమ స్లిప్పర్లను, బూట్లను లైన్లో ఉంచి మరీ ఎదురుచూస్తున్నారు.
కచ్ జిల్లా రాపార్ తాలూకా కేంద్రంలో ఎరువుల కోసం రైతులు ఎండలో రోజుల తరబడి ఎదురుచూస్తున్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి.