హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లు చేపట్టనున్నారు. కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపకల్పన చేశారు. ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ఐచ్ఛికాలు తీసుకోనుంది. కలెక్టర్, జిల్లా శాఖాధిపతితో బదిలీల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీలు, పోస్టింగుల తర్వాత విధుల్లో చేరేందుకు 3 రోజుల గడువు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి పోస్టులకు, జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు విడివిడిగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.