హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువత ఎటువంటి వదంతులు నమ్మకుండా పోటీ పరీక్షలకు సంసిద్ధులు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, శాతవాహన విశ్వవిద్యాలయం సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 20న కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో నిర్వహించనున్న పోటీ పరీక్షల అవగాహనా సదస్సు పోస్టర్ను గురువారం మంత్రి కరీంనగర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాలు సాధించేందుకు యువత శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు.