TSPSC | హైదరాబాద్ : గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనున్నది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఈ నెల 16వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని, మెయిల్ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోబోమని కమిషన్ తెలిపింది. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మట్లో పొందుపరచాలని సూచించింది. 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎడిట్కు అవకాశం ఉన్నదని, మరోసారి అవకాశం ఇవ్వబోమని కమిషన్ స్పష్టం చేసింది. తెలంగాణలో 105 విభాగాల్లో గ్రూప్-3 కేటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్లో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది.