Group 1 Exams | ఉద్యోగం సాధించాలనే తెలంగాణ నిరుద్యోగ యువత ఆశలపై టీజీపీఎస్సీ నీళ్లు చల్లింది. రోజుకు పదిపన్నెండు గంటలపాటు చదివిన విద్యార్థులకు కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత ఫలితంగా నిరాశ మిగిలింది. ప్రతిభావంతులైన తెలంగాణ నిరుద్యోగ యువత కోచింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకున్నారు. కొంతమంది ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. అలాంటివారు ఉద్యోగాలు పొందలేని పరిస్థితిని కల్పించింది. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ -1 పరీక్ష రద్దు అయినా, దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ పాఠాలు నేర్చుకోలేదు.
మహిళలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి, దివ్యాంగులకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. వారికి హైదరాబాద్కు దూరంగా ఉన్న కాలేజీల్లో రెండు, మూడు అంతస్థులను కేటాయించింది. ఇది కేంద్రాల కేటాయింపులో టీజీపీఎస్సీ వివక్షను సూచిస్తున్నది. దివ్యాంగుల విషయంలో సహజ న్యాయసూత్రాలను కమిషన్ ఉల్లంఘించింది.
మూల్యాంకనం సరైన విధానంలో జరగలేదు.మాడరేషన్ విధానాన్ని అమలు చేయలేదు. ఈ విషయంలో కమిషన్ పరస్పర విరుద్ధంగా వ్యవహరించింది. మూల్యాంకనం చేసిన వాళ్లు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిపుణులే, అయితే మూల్యాంకన విధానం మాత్రం ఒకేరీతిలో జరగలేదు. కమిషన్ రెండు, మూడు రకాల మూల్యాంకనం చేయించింది. మాడరేషన్నుఅనుసరించలేదు, ఇది అసమానతకు దారి తీస్తుంది.ఇది రాజ్యాంగ హకులను ఉల్లంఘించడమే.
-హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాగైనా సరే గ్రూప్-1 పరీక్షలను పూర్తి చేయాలని పట్టుదలకుపోయిన కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని తేల్చింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30న ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచింది. కొందరు అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేయాలని, చేయవద్దని కోరుతూ దాఖలైన 12 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు, పత్రాల పరిశీలన, విశ్లేషణ అనంతరం మంగళవారం 222 పేజీల సంచలన తీర్పును వెలువరించింది. విధానపరమైన అంశాలు, మూల్యాంకన పద్ధతి ఆధారంగా విభజించి తీర్పునిచ్చింది. గ్రూప్-1 మెయి న్స్ పరీక్షను కమిషన్ పారదర్శకంగా నిర్వహించలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. సమగ్రత కొరవడిందని తప్పుపట్టింది. పక్షపాతంతో వ్యవహరించిందని ఉద్యోగ నియామక నియమాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని తేల్చింది. ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిందని, రోజుకు పదిపన్నెండు గంటలపాటు చదివిన విద్యార్థులకు కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత ఫలితంగా నిరాశ మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిభావంతులైన తెలంగాణ నిరుద్యోగ యువత కోచింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.
కొంతమంది అభ్యర్థులు గ్రూప్-1 పోస్టులు సాధించేందుకు ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారని, వారికి ఉద్యోగాలు పొందలేని పరిస్థితిని కల్పించిందని టీజీపీఎస్సీపై నిప్పులు చెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ మూల్యాంకనంలోనే కాకుండా విధానపరమైన అంశాల్లోనూ వైఫల్యం చెందాయని మండిపడింది. రెండుసార్లు గ్రూప్ -1 పరీక్ష రద్దయినా, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కారణాల వల్ల ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసిన తుది మారుల జాబితాను, అదే నెల 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మేరకు ‘మాడరేషన్’ పద్ధతిని వర్తింపజేయడం ద్వారా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాలను మాన్యువల్గా తిరిగి మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాతే ఫలితాలను ప్రకటించాలని, అనంతరం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పునఃమూల్యాంకనం చేయలేని పక్షంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కీలక ఆదేశాలను వెలువరించింది. గత ఏడాది ఫిబ్రవరి 19న వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్ (నెం.02/ 2024) మేరకు పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం తీర్పు వెలువడినప్పటి నుంచి ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
మూల్యాంకనం సరైన విధానంలో జరగలేదని, మాడరేషన్ విధానాన్ని అమలు చేయలేదని హైకోర్టు తప్పుపట్టింది. మూల్యాంకనం చేసిన వాళ్లు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిపుణులేనని, మూల్యాంకన విధానం ఒకేరీతిలో జరిగలేదని పేర్కొన్నది. కమిషన్ రెండు, మూడు రకాల మూల్యాంకనం చేయించిందని తేల్చింది. మాడరేషన్ను అనుసరించలేదని, ఇది అసమానతకు దారి తీస్తుందని, రాజ్యాంగ హకులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టంచేసింది. ఏకపక్ష మూల్యాంకనం చెల్లదన్నది. ‘కమిషన్ తొలి జాబితాలో సోషియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్కు ప్రత్యేక ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమం అవగాహన ఉన్నవారు, ఆరువిభాగాల జనరల్ వ్యాసాలకు విభాగాలవారీగా ప్యానెల్ లేదు. చాలామంది డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, సబ్జెక్టుపై తాజా అవగాహనలేని వాళ్లున్నారు. రిటైర్డ్ అయినవాళ్లున్నారు. ఇది సువాంకర్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం. మూల్యాంకనానికి అదే సబ్జెక్టు నిపుణుడే ఉండాలి. మూల్యాంకన ప్రక్రియను టీజీపీఎస్సీ అపహాస్యం చేసింది’ అని హైకోర్టు మండిపడింది.
మూల్యాంకంన విషయంలో నోటిఫికేషన్ నిబంధనలకు కమిషన్ నీళ్లు వదిలిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూల్యాంకనం తొలి రెండుసార్లు బార్ కోడ్, బబ్లింగ్ ఆధారంగా చేసినట్టు వెబ్సైట్లో పొందుపర్చిందని గుర్తుచేసింది. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో చెప్పలేదన్నది. ఏపీలో కూడా ఇదేవిధానాన్ని అనుసరించిందని టీజీపీఎస్సీ చెప్పుకున్నదని, కానీ ఏపీకి భిన్నంగా మూడో మూల్యాంకనం చేయించిందని పేర్కొన్నది. దీంతో మారులు తారుమారు చేసేందుకు వీలుంటుందని అనుమానం వ్యక్తంచేసింది. పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో మూడో మూల్యాంకనం విధానాన్నే పేరొనలేదని తెలిపింది. మూల్యాంకనానికి ఒక విధానాన్ని అవలంబించలేదని తప్పుబట్టింది.‘ఇంగ్లిష్లో కనీస అర్హత ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం చొప్పున ఉండాలి. ఇవి ర్యాకింగ్కి తీసుకోరు. ఈ రూల్ను కమిషన్ అమలుచేస్తే 30 శాతం కంటే తకువ మారులు వచ్చినవారు ఇతర పేపర్ల ఎవాల్యుయేషన్కు అనర్హులు. కమిషన్ సమాచారం ప్రకారం ఇంగ్లిష్లో అర్హత సాధించనివారి పత్రాలను మూల్యాంకనం చేసి మారులను వెల్లడించింది. అంటే నోటిఫికేషన్ నిబంధనలకు కమిషన్ నీళ్లు వదిలిందన్న మాట’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూల్యాంకనం ఎంత నిజాయితీగా జరిగిందో, పారదర్శకంగా జరిగిందో ఇదే నిరూపిస్తున్నదని ఎద్దేవాచేసింది. ఫెయిల్ అయ్యాక ఎంపికప్రక్రియను సవాల్ చేయడం చెల్లదని, పిటిషన్లు విచారణార్హం కాదన్న కమిషన్ వాదనను తిరసరించింది. అక్రమాలు, అవకతవకలు జరిగినపుడు న్యాయసమీక్ష చేయవచ్చునని పేరొన్నది.
‘నిబంధనల ప్రకారం మూల్యాంకనానికి రెగ్యులర్ సిబ్బందినే వినియోగించాల్సి ఉండగా, రిటైర్డ్ వాళ్లను కమిషన్ వినియోగించింది. ఒకరు ఆర్సీరెడ్డి సెంటరులో పనిచేసినట్లు ఆధారాలున్నా చర్యలు తీసుకోలేదు’ అని హైకోర్టు నిలదీసింది. ‘కమిషన్ ప్రకటన ప్రకారం రెండుసార్లు మూల్యాంకనం చేయాలి. తెలుగు, ఇంగ్లిష్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా అభ్యర్థులకు నష్టమన్న వాదనను కమిషన్ కాదంటున్నది. ఇద్దరి మూల్యాంకనంలో 15 శాతం మారులు తేడా ఉం టే మూడోసారి మూల్యాంకనం చేసినట్టు చెప్పింది. దీని కీ లేదని కమిషన్ చెప్పడం విడ్డూరంగా ఉన్నది’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
తెలంగాణ ఉద్యమం గురించి ఒకరు ఒక పేజీలో, మరొకరు 10 పేజీల్లో రాసినట్లయితే ఎలా మా రులు వేస్తారన్న కోర్టు ప్రశ్నకు కమిషన్ జవాబు చెప్పలేదని ఆగ్రహం వక్తం చేసింది. కమిషన్ మాట మీద నిలబడలేదని, ఎప్పటికప్పుడు మాట మార్చిందని మండిపడింది. మాడరేషన్ విధానాన్ని అనుసరించామని చెప్పి, తర్వాత కాదని చెప్పడమే నిదర్శనంగా అభివర్ణించింది. కమిషన్ ఎంచుకున్న మూల్యాంకన ప్రక్రియ దాని ప్రతిష్టను నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఎంతోమంది కార్పొరేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి గ్రూప్-1 పోస్టులకు పోటీపడితే, వాళ్లకు వచ్చిన మారులు విస్మయానికి గురిచేశాయి. నాలుగు సబ్జెక్టుల్లో కేవలం సింగిల్డిజిట్ మారులే వచ్చాయి. తెలంగాణ ఉద్యమం గురించి రాస్తే 7 మారులే వచ్చాయి. కొన్ని సెంటర్లలో ఒకరు కూడా అర్హత సాధించలేదు. కమిషన్ సీల్డ్కవర్లో ఇచ్చిన వివరాలు పరిశీలిస్తే మూల్యాంకనం కోసం ఒక విధానమే అనుసరించలేదని తేలింది. ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగులోనే ఉన్నాయి.
ఉర్దూలో లేవు. కొన్ని సమాధానాలకు వివరణ లేదు. రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన పలువురికి ఒకేరకమైన మారులు వచ్చాయి. 719 మందికి ఒకేలా, 440 మందికి ఒకేవిధంగా మారులు వచ్చాయి. దీనిని కమిషన్ సమర్థించుకోవడం ఆమోదయోగ్యంగా లేదు’ అని అభిప్రాయపడింది. కోఠి ఉమెన్స్ కాలేజీ సెంటర్ లో అభ్యర్థులు ఎకువ మంది ఎంపికయ్యారన్నది పిటిషనర్ల అభియోగం అని గుర్తుచేసింది. ‘మహిళా అభ్యర్థులను 28 కేంద్రాల్లో కేటాయించగా, కోఠి ఉమెన్స్ కాలేజీలోని రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు. ఇది ఎలా సాధ్యం. మిగిలిన 26 పరీక్షా కేంద్రాలో 139 మందే ఎంపికయ్యారు. ఈ కేం ద్రాల్లో మహిళలు ప్రతిభావంతులు కాదా? పేపర్-6లో అత్యధిక మారులు వంద ఎవరికీ రాలేదు. రీ కౌంటింగ్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ల మారులు మారాయి. ఇవి సందేహాలకు తావిస్తున్నది’ అని పేర్కొన్నది.
12,381మంది అభ్యర్థులు ఇంగ్లీషులో రాస్తే 506 మంది ఎంపికయ్యారని, తెలుగులో 8,694 మంది హాజరైతే కేవలం 56 మందే ఎంపికయ్యారని, ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికయ్యారని ధర్మాసనం గుర్తుచేసింది. తెలుగులో రాస్తే మూ ల్యాంకనం సరిగ్గా జరగలేదని, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో బోధన చేస్తారని, వాళ్లే మూల్యాంకనం చేశారని కమిషన్ చెప్పిందన్నది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో నిపుణులే మూ ల్యాంకనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీలో తెలుగు అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో మూడు దశల్లో వడపోశారని, కానీ ఇకడ అలా జరగలేదని స్పష్టం చేసింది. మొత్తంగా తెలుగులో రాసిన వాళ్లకు తీరని అన్యాయం జరిగినట్లు అనిపిస్తున్నదని ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.
టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్షరాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఉన్నాయనే వాదన వాస్తవం కాదన్నారు. 21,110 మంది అభ్యర్థులు ఉండగా, 25 మంది స్పోర్ట్స్ కోటా వాళ్లను మినహాయిస్తే, 21,085 మంది ఉన్నారన్నారు. తెలుగు మీడియంవారు 8,694 మంది, ఇంగ్లిష్ మీడియం 12,381 మంది, ఉర్దూ మీడియం 10 మంది చొప్పున పరీక్ష రాశారని తెలిపారు. మహిళలు అత్యధిక సంఖ్యలో అర్హత సాధించారన్నారు. ఎంపికైన వారిలో 12 శాతం మంది కోఠి మహిళా కాలేజీ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసిన మహిళా అభ్యర్థులే అనే ఆరోపణలు తప్పు అని, అక్కడ రాసి అర్హత సాధించిన వారు 5.4 శాతంలోపే ఉన్నారన్నారు. మూల్యాంకనం మూడు దశల్లో జరిగిందని ధర్మాసనానికి టీజీపీఎస్సీ తెలిపింది. మొదట ప్రొఫెసర్ మూల్యాంకం చేసిన తర్వాత, రెండో మూల్యాంకనం జరిగిందన్నారు. ఇందులో వ్యత్యాసం 15 శాతానికి మించితే మూడో వ్యక్తి మూల్యాకనం చేశారని వివరించారు. తొలి మూల్యాంకనంలో ఎన్ని మారులు వచ్చాయో రెండో మూల్యాంకనం చేసేవాళ్లకు తెలియదని అక్రమాలకు తావేలేదని వాదించారు.
పిటిషనర్ల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు కే శ్రీనివాసమూర్తి, రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్నారు. ఎనిమిదిన్నర వేల మందికిపైగా తెలుగులో పరీక్షలు రాస్తే కేవలం 60 మందిలోపు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మూల్యాంకనం చేసే వాళ్లకు తెలుగు తెలియకపోవడంతో తీరని అన్యాయం జరిగిందన్నారు. పలువురు అభ్యర్థులకు తెలుగు భాష మీద పట్టు ఉన్నా, గ్రూప్-1 పోస్టులకు ఎంపిక కాలేకపోయారన్నారు. తెలుగురాని, అర్హతలేని వారు మూల్యాంకనం చేయడమే ఈ దుస్థితికి కారమణమని వాదించారు. 18 రకాల సబ్జెక్టులు ఉంటే 12 సబ్జెక్టుల పేపర్లునే నిపుణులతోనే దిద్దించారన్నారు. ఒకే మాధ్యమ నిపుణులతో ఇంగ్లిష్, తెలుగు మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారని, తెలుగులో రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, తిరిగి మూల్యాంకనం చేయాలని కోరారు. అప్పటివరకు నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తెలుగు, ఉర్దూలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మారులను కోల్పోయే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే రాష్ట్ర భవిష్యత్తుకు ద్రోహం తప్పదని, లోపభూయిష్ట ఎంపిక ప్రభావం రెండు మూడు తరాలపై ఉంటుందన్నారు.
ఒకే పరికరం మీద బయోమెట్రిక్ తీసుకున్నామని కమిషన్ చెప్పిందని, పరీక్ష కేంద్రాల్లో ఇంటర్నెట్ లేదనందున సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరిపామని చెప్పిందన్నారు. ఇంటర్నెట్ లేకుండా సీసీ కెమెరాలు ఎలా పనిచేశాయో కమిషన్కే తెలియాలన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్నవాళ్లకు ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం లేదని చెప్పారు. అసలు మూల్యాంకనం విధానం ఏమిటో, ఏ సమయంలో చేస్తారో టీజీపీఎస్సీ వెల్లడించలేదన్నారు. రీవాల్యూయేషన్ చేసే వీలులేదని సర్వీస్ కమిషన్ స్వయంగా చెప్పిందని, ఆ తర్వాత రెండు, మూడు రీవాల్యుయేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. పైగా పరీక్షకు 21 వేల మంది హాజరైతే అందులో ఐదు వేల మందికే రీవాల్యుయేషన్ జరపడం వివక్ష చూపడమేనని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామక నోటిఫికేషన్లో నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటికి విరుద్ధంగా అమలు చేయడం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని వాదించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్రావు వాదిస్తూ.. గ్రూప్-1 పరీక్షలపై మొదటి నుంచీ కుట్రే జరిగిందని, అక్రమాలకు నెలవుగా మారిందని ఆరోపించారు. కొందరికే లబ్ధి చేకూరేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందన్నారు. హాల్టికెట్ల దశ నుంచి పరీక్షా కేంద్రాల ఖరారు, అభ్యర్థుల హాజరైన సంఖ్యలో వ్యత్యాసం, ఒకసారికి బదులు మూడుసార్లు మూల్యాంకనం, మూల్యాంకనానికి ఎంపిక చేసిన ప్రొఫెసర్లు.. ఇవన్నీ కూడా ఒక కుట్ర పూరిత పథకం ప్రకారమే జరిగాయన్నారు. జనవరి 11 నుంచి జనవరి 25 వరకు మూల్యాంకనం నిమిత్తం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్కు టీజీపీఎస్సీ లేఖ రాసిందని గుర్తుచేశారు. ఆ లేఖ రాయడానికి ముందే ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం వెళ్లిందన్నారు. ఇక తెలుగులో పరీక్ష రాసిన పేపర్లను ఇంగ్లిష్ వచ్చిన ప్రొఫెసర్లు ఎలా మూల్యాంకనం చేశారో ఆ దేవుడికే తెలియాలన్నారు. మూల్యాంకనం తొలిసారి చేసిన వాళ్లకి, రెండో వ్యక్తి బండిల్, బండిల్ నెంబర్లు, సీరియల్ నెంబర్లతో సహా ఇచ్చారంటే ఆ పేపర్లు ఎవరివో తెలిసిపోతుందన్నారు. ప్రిలిమ్స్కు, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లను జారీ చేయడం టీజీపీఎస్సీకే చెరగని మాయనిమచ్చగా అభివర్ణించారు.
న్యాయవాది జీ విద్యాసాగర్రావు వాదిస్తూ.. మూల్యాంకనం నిబంధనలను టీజీపీఎస్సీ ఇష్టం వచ్చినట్లు మార్చిందని, సొంత నిబంధనలను తుంగలో తొకిందన్నారు. మూల్యాంకనం ఒకసారి మాత్రమే నిర్వహించాలనే నిబంధనను గాలికి వదిలేసిందని, మూడుసార్లు మూల్యాంకనం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. మూల్యాంకనంలో రీకౌంటింగ్ తప్ప రీవాల్యుయేషన్కు ఆసారమే లేదని నిబంధనల్లో ఉన్నదన్నారు. ఒకసారి మూల్యాంకనం చేశాక, రెండోసారి చేస్తారని, ఆ రెండింటి సగటు మారులను తీసుకుంటామని, అక్కడా భారీ వ్యత్యాసం వస్తే మూడోసారి మూల్యాంకనం చేస్తామని మళ్లీ కమిషనే స్వయంగా అంగీకరించిందన్నారు. ఇది సొంత నిబంధనలను టీజీపీఎస్సీ తుంగలోకి తొక్కడమే అన్నారు. అభ్యర్థుల సంఖ్యను కూడా సర్వీస్ కమిషన్ పెంచుకుంటూ వెళ్లడాన్ని బట్టి ఎంతగా అవినీతి, అక్రమాలు జరిగాయో అర్ధం చేసుకోవాలని కోరారు.
మెయిన్స్లో అర్హత సాధించిన 263 మంది అభ్యర్థుల తరఫున కిళాంబి లక్ష్మీ నర్సింహ వాదించారు. గ్రూప్-1 పరీక్షలపై ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. ‘14 ఏళ్లుగా నియామకాల్లేవు. తప్పు ఎకడ జరిగిందో తనకు ఎలా నష్టం వాటిల్లిందో పిటిషనర్లు చెప్పడం లేదు. గుంపగుత్తగా పరీక్షలను రద్దుచేయాలని కోరడం చట్టవ్యతిరేకం. సుప్రీం కోర్టు, పలు హైకోర్టుల ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలయ్యాక కోర్టుల జోక్యానికి పరిధి తకువ. వితండ వాదనలతో నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలను ఆపాలి. ఎంపికైన వారిలో 70 శాతానికిపైగా పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులే ఉన్నారు. పరీక్షలు పారదర్శకంగా జరిగాయి. పిటిషన్లను కొట్టేయాలి’ అని కోరారు.
గ్రూప్-1 మెయిన్స్లో జవాబు పత్రాల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు, తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పేపర్లు దిద్దిన వారిలో ఎకువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మారుల కేటాయింపులో అన్యాయం జరిగిందని, పరీక్ష కీలో 14 తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. జీవో 29 వల్ల బలహీనవర్గాల రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందని, దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లామన్నారు. పరీక్షలో అవకతవకలు జరిగాయని, తిరిగి నిర్వహించాలన్నారు.
సబ్జెక్ట్ నిపుణులతోనే జవాబు పత్రాల ముల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ వాదించింది. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్- 1లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని గుర్తు చేసింది. అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే మారులు వచ్చాయని, మాధ్యమం ఆధారంగా మారులు ఉండనే ఉండవని చెప్పింది. పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదని, గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు లేకుండా పిటిషన్లను కొట్టేయాలని కోరింది.
కేంద్రాల కేటాయింపులో వివక్ష కనబడిందని కోర్టు అభిప్రాయపడింది. కోఠి ఉమెన్స్ కాలేజీలో మహిళలకే ఎందుకు కేటాయించారన్న పిటిషనర్ల సందేహాన్ని కమిషన్ సరిగా నివృత్తి చేయలేదని తేల్చింది. కాలేజీ అధికారులు మహిళలకే కేటాయించాలని కోరారని కమిషన్ చెప్తున్నా, దానికి ఆధారాలను ఇవ్వలేదని తెలిపింది. పురుషులు, మహిళలు ఒకే కేంద్రంలో ఉంటే భద్రతా సమస్యలు వస్తాయని కమిషన్ చెప్పిందేగానీ నిబంధనల్లో లేదని ధర్మాసనం పేర్కొన్నది. ఇదే కేంద్రంలో యూపీఎస్సీ పరీక్షలను పురుషులు, మహిళలు రాశారని గుర్తుచేసింది. ‘మహిళలకు ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేసిన కమిషన్.. దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. హైదరాబాద్కు దూరంగా ఉన్న కాలేజీలో రెండు, మూడు అంతస్థులను కేటాయించింది. ఇది వివక్షను సూచిస్తున్నది. అభ్యర్థుల సామాజిక న్యాయం, సౌకర్యాలు, వసతులను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పిన కమిషన్.. దివ్యాంగుల విషయంలో అన్యాయం చేసింది. సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించింది’ అని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళా అభ్యర్థులను రెండు కేంద్రాల్లోనే ఎందుకు కేటాయించారన్న ప్రశ్నకు జవాబు లేదని, ర్యాండమైజేషన్ విధానం అని చెప్పినా నిష్పక్షపాతంగా అనిపించడం లేదని స్పష్టం చేసింది.
మెయిన్స్ పేపర్లను పునఃమూల్యాంకనం చేయాలన్న హైకోర్టు తీర్పు అమలు సాధ్యమేనా అనే అంశంపై న్యాయవర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దీనికి నోటిఫికేషన్ నిబంధనలు అడ్డంకిగా ఉన్నట్టు చెప్తున్నారు. ఒకసారే మూల్యాంకనం చేయాలని నిబంధనల్లో ఉన్నదని, నోటిఫికేషన్లోని 15.4 నిబంధన ప్రకారం రీకౌంటింగ్కు మాత్రమే అవకాశం ఉన్నదన్నా రు. 15.5 నిబంధన ప్రకారం.. అనర్హ అభ్యర్థులకు, తిరసరించిన వాళ్లకు మారుల మెమోరాండం జారీ ఉండదని, వీళ్లకు చెందిన ఫీజుల వ్యవహారంపై ఉత్తరప్రత్యుత్తరాలకు ఆసారం ఉండదని తెలిపారు. నియమం- 3 (IX) (d) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్కు దరఖాస్తుల స్వీకరణ ఉండదని గుర్తు చేస్తున్నారు. నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా పునః మూల్యాంకనం చేయడానికి వీల్లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేసి ఉత్తర్వులు పొందడం, లేదా అక్కడా ఓడిపోతే మిగిలింది సుప్రీం కోర్టేనని చెప్తున్నారు.
పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం గతంలో పలు కీలక ప్రశ్నలు అడిగింది. మూ ల్యాంకనం నిమిత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే వారి ఎంపిక విధానం ఏమిటో కమిషన్ చెప్పాలని సూచించింది. ఇతరరాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ చరిత్రను మూల్యాంకనం ఎలా చేస్తారో కూడా చెప్పాలని కోరింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు తెలుగు మీడియంలో ఎంతమంది రాశారో, వారిలో ఎంతమంది అర్హత సాధించారో తెలుపాలని కోర్టు వివరాలు అడుగగా సర్వీస్ కమిషన్ అడ్డుచెప్పడానికి ప్రయత్నించింది.
పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో ఈ అంశాన్ని లేవనెత్తలేదని కమిషన్ చెప్పడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అవతకవలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న సమయంలో తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వాళ్ల వివరాలను చెప్పబోమని అంటే ఎలాగని ధర్మాసనం నిలదీసింది. పిటిషన్లో తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వాళ్ల ఉత్తీర్ణత శాతం అంశం లేకపోయినా తాము అడుగుతామని తేల్చి చెప్పింది.రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన పలువురికి ఒకేరకమైన మారులొచ్చాయి. 719 మందికి ఒకే తీరుగా వచ్చాయి, 440 మందికి ఒకేలా మారులు వచ్చాయి. దీనిని కమిషన్ సమర్థించుకోవడం ఆమోదయోగ్యంగా లేదు.
-హైకోర్టు
మహిళా అభ్యర్థులను 28 కేంద్రాల్లో కేటాయించగా, కోఠి ఉమెన్స్ కాలేజీలోని రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు. మిగిలిన 26 పరీక్షాకేంద్రాలో 139 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇది ఎలాసాధ్యం? -హైకోర్టు