Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీకే శివకుమార్ (DK Shivakumar) తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కనకపుర (Kanakapura) లో పర్యటించారు. సామాన్య ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు (Traffic issues), ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విధాన సౌధ మెట్రోస్టేషన్ నుంచి కనకపుర మెట్రోస్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
ఏ విధమైన హంగూ ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్యుడిలా మెట్రో ఎక్కిన ముఖ్యమంత్రిని చూసి తోటి ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన రైల్లోని ప్రయాణికులతో చాలా సాదాసీదాగా, సరదాగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో ప్రయాణం ముగిసిన తర్వాత కనకపుర స్టేషన్ వద్ద దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముందుకు సాగారు. వినూత్నంగా ఆలోచించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మెట్రోను ఎంచుకున్న సీఎం డీకే శివకుమార్పై బెంగళూరు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.