mission kakatiya | గత నాలుగైదేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురువడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో భూమిలో నీటి మట్టం బాగా పెరిగిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ సిద్ధార్థ కుమార్ తెలిపారు. నీటిని కలుషితం కాకుండా కాపాడాలని, భూమి మీద అన్ని జీవరాశుల ఉనికికి, జీవనానికి నీరు అతిముఖ్యమైందని సూచించారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని కిట్స్ కళాశాలలో ‘ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ అధ్యక్షతన జరిగిన పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. ఒక వేల వర్షాలు పడక పోతే నీటి కొరత లేకుండా ఆదా చేసుకోవాలని చెప్పారు.
దీనికోసం ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. రైతులు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, మైక్రో వాటర్ సిస్టమ్స్ ఉపయోగించి సాగు నీటిని ఆదా చేయాలన్నారు. ఇక్కడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్తలు మల్లికా దేవి, వీఆర్ రాణి, డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.