నిర్మల్ : మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో పెండ్లి, బంధుగణంతో ఆ ఇంట సందడి నెలకొంది. పెండ్లి పనుల కోసం ఇంటిల్లిపాది నిమగ్నమయ్యారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది. ఆదివారం పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు(Groom dies) వినోద్ కుమార్ విద్యుదాఘాతంతో(Electric shock) మృతి చెందాడు.
ఈ విషాదకర సంఘటన నిర్మల్(Nirmal) జిల్లా కడెం మండలం చిన్నబెల్లాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. వినోద్ స్నానానికి వెళ్లిన సమయంలో గీజర్కు కరెంట్ షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందడు. మంగళవాయిధ్యాలు మోగాల్సిన చావు డప్పు మోగాల్సి రావడంతో వరుడి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.