హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఉపసంఘం సమావేశం జరుగుతున్నది. నగరంలోని జలసౌధాలో జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ జరుగనుంది.