హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ తమ టెక్నాలజీ, ఇంజినీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పింది. శుక్రవారం గ్రిడ్ డైనమిక్స్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావును కలిసి ఈ యూనిట్ గురించి వివరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
వార్డు ఆఫీసర్ పోస్టులు
దేశంలోనే సరికొత్త విధానంలో తెలంగాణలోని 141 పట్టణాల్లో వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్టు మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, వార్డు కౌన్సిలర్లతో సమన్వ యం చేసుకోవడానికి వార్డు ఆఫీసరు పోస్టులు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.