హైదరాబాద్: విద్యావేత్త, సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండర్, చైర్మన్ గ్రెగోరి రెడ్డి(88) బుధవారం తుదిశ్వాస విడిచారు. 1970లో సొసైటీని నెలకొల్పిన ఆయన ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. బోధనలో ఆధునిక పద్ధతులను అవలంబించి, అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. గ్రెగోరిరెడ్డి అల్లుడు విజయ్కుమార్రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్గా పనిచేస్తున్నారు.