హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో ప్రముఖ సింగర్ శ్రీ లలిత మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రీ లలిత మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి మనకు తల్లిలాంటిది అని అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.
రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని శ్రీ లలిత కోరారు. అనంతరం ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని సింగర్స్ షణ్ముఖ ప్రియ, రమ్య బెహెరా, రాస్తా రామ్ ముగ్గురికి చాలెంజ్ విసిరారు.