మహబూబ్నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హరిత యజ్ఞం వల్లే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమైందని ఆయన కొనియాడారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కు తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జడ్చర్ల మండలం మాచారం గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టాలని లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఒకే రోజు 50 వేల మొక్కలు..
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్పంచుల సంఘం పిలుపు మేరకు ఒకే రోజు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.