హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అదనపు జిల్లా జడ్జి అండ్ సెషన్స్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు విజ్ఞప్తి మేరకు రాష్ట్రవ్యాప్తంగా 57 కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు న్యాయ శాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు వెలువరించారు. మూడు క్యాటగిరీల్లో కోర్టుల ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.