హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన కొడుమూరు వందనం ఎత్తిపోతల పథకం ఫేజ్-2కు రూ.35.75 కోట్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సాగునీటి పాదరుల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగార్జునసాగర్ 21వ మెయిన్ బ్రాంచి కెనాల్పై 9.25 కిలోమీటర్ల వద్ద దీనిని నిర్మించనున్న ఈ పథకం ద్వారా 2,500 ఎకరాల మిగులు ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. ముదిగొండ మండలం పండ్రేగుపల్లి సమీపంలో మున్నేరు నదిపై ఉన్న ఆనకట్ట మరమ్మతులకు రూ.107.30 కోట్లను, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి సమీపంలో కలువల వాగుపై చెక్డ్యామ్ నిర్మాణానికి రూ.3.63 కోట్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.