గజ్వేల్, ఏప్రిల్ 29: కేసీఆర్ స్ఫూర్తితో పురుడుపోసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం వెనుక, మొక్కలు నాటి వాటిని సంరక్షించిన ప్రతి ఒక్కరి కృషి ఉందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ అన్నారు. బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ అవార్డు అందుకున్న సందర్భం గా బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండ లం గౌరారంలోని ఫామ్స్టే రిసార్ట్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ హరిత సైనికుల ఆధ్వర్యంలో సంతోష్ను ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. హరితసేనకు దక్కిన గౌరవం మీ అందరిదని, మొక్కలు నాటి సంరక్షించిన ప్రతి చెయ్యికీ ఈ అవార్డు అంకితమని తెలిపారు. తెలంగాణలో అడవుల గణాంకాలు 7.8శాతంగా ఉన్నట్టు గుర్తించిన తరువాత కేసీఆర్ హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 280కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రణాళిక రూపొందించడంతో నేడు తెలంగాణలో అడవుల విస్తీ ర్ణం పెరిగిందని తెలిపారు.
కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో 2018లో ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో హరిత సైనికుల కృషి ఫలితంగా నేడు మంచి ఫలితాలు రాబట్టామ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే కమాండ్ వెబ్స్ లోగో రాబోతుందని వెల్లడించారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి తీ సుకెళ్లి విజయవంతంగా ముందుకు సాగేలా కృషి చేయాలని హరిత సైనికులను కోరారు. అనంతరం నీటిపొదుపుపై ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు విద్యాసాగర్రావు వర్ధంతి సందర్భంగా మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, హరితసేన రాష్ట్ర నాయకులు రాఘవేందర్యాదవ్, కరుణాకర్రెడ్డి, చెప్యాల రాజేశ్వర్రావు, సతీశ్ పాల్గొన్నారు.