హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్(MP Santhosh kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్(Green India Challenge) లో భాగంగా హైదరాబాద్ శిల్పారామం లో న్యూ ఢిల్లీ హై కమిషన్ ఆఫ్ ద కింగ్డమ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో(Mr. Thabang Linus Kholumo) మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు.
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భారతీయులందరూ పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. అనివార్య స్థితిలో చెట్లను నరికివేసిన మళ్లీ వీలైనన్నీ మొక్కలు నాటాలని సూచించారు. ఈ భూమిని మనం విడిచిపెట్టినా మనం నాటిన చెట్లు మిగులుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని లినస్ ఖోలుమో అన్నారు.ఈ కార్యక్రమం లో సూరత్ సింగ్ మల్హోత్రా, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ పాల్గొన్నారు.