హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ నరేంద్రకుమార్ ప్రశంసించారు. ఆదివారం రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్లో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. 75 ఔషధ మొక్కలు నాటినట్టు నరేంద్రకుమార్ తెలిపారు. ఎన్ఐఆర్డీలో చేపడుతున్న కార్యక్రమాలను నరేంద్రకుమార్ వివరించగా.. ఎంపీ సంతోష్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధిక రస్తోగి, లెఫ్టినెంట్కల్నల్ అశుతోష్కుమార్, రిజిస్ట్రార్, డైరెక్టర్ (అడ్మిన్) శశిభూషణ్, ప్రగతి రిసార్ట్ చైర్మన్ జీబీకే రావు, డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు.