హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ సాధించిన విజయాలపై ఇండియా టుడే గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్ న్యూస్ స్టోరీ పేరుతో ఈ కథనాన్ని ప్రసారం చేసింది. గ్రీన్ ఇండియా చాలెంజ్కు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అత్యధిక మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కిన విషయాన్ని ఈ కథనంలో ప్రస్తావించారు.
అమితాబ్బచ్చన్, అమీర్ఖాన్, సల్మాన్ఖాన్ వంటి అనేక మంది సెలబ్రిటీలు ఇందులో భాగస్వామ్యమైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో పచ్చదనం పెరిగినట్టు కథనం పేర్కొంది. రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలని, మరింత మంది ఎంపీలు, సెలబ్రిటీలు పాల్గొని విస్తృతం చేయాలని కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్పై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఇండియా టుడేకు, రాజ్దీప్ సర్దేశాయ్కు ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.