Hyderabad | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో పర్యావరణహితమైన బస్సులను పెంచే దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సరికొత్త ‘గ్రీన్ మెట్రో లగ్జరీ’ పేరుతో 50 ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది. వీటిలో 25 బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొననున్నారు. మిగిలిన 25 బస్సులను నవంబర్ నాటికి ప్రవేశపెట్టనున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సును పూర్తిగా చార్జింగ్ చేసేందుకు 3-4 గంటల సమ యం పడుతుంది. ఒకసారి చార్జింగ్తో 225 కి.మీ. ప్రయాణించే ఈ బస్సులో 35 సీట్లు, నెల రోజుల బ్యాకప్ సామర్థ్య కలిగిన రెండు సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి. ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సదుపాయంతోపాటు రీడిండ్ ల్యాంప్ను ఏర్పాటు చేశారు. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ తదితర అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.