సూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రభుత్వం కొత్తగా 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల(Assistant Professors) నియామకాలకు ఆదేశాలు జారీచేసింది. ఏక కాలంలో ఇంత మందిని నియమించడం ద్వార వైద్య రంగంలో నూతనాద్యాయం సృష్టించినట్లైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy | )పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
జనరల్ మెడిసిన్కు 5, జనరల్ సర్జన్ 7, ఆర్థోపెడిక్ 3, పిడియాట్రిక్ 5 అసిస్టెంట్ల ఫ్రొఫెసర్ల నియమించిందని మంత్రి తెలిపారు. ఈఎన్టీ 1, ఓబీ జీ 8, అనస్థీషియా 7 అనాటమీ 1, పథాలజీ 2, మైక్రో బయోలజీ 1 , ఫోరెన్సిక్ మెడిసిన్ 1, రేడియో డయాగ్నిస్ 3, ఆప్తాల్ 1, కమ్యూనిటీ మెడిసిన్ 1 విభాగాలకు కలిపి మొత్తం 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్(CM KCR) విద్య, వైద్య రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు ఈ నియామకాలు అద్దం పడ్తుందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవల విస్తరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ దోహద పడుతుందని అన్నారు. పేదలకు ఆధునిక వైద్యం అందుబాటులోకీ తేవడమే కాకుండా అందుకు అనుగుణంగా నియామకాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఅర్ సామాన్యుడిపై ఉన్న ప్రేమ ను మరోమారు చాటుకున్నారని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా సహచర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు(Minister Harish Rao) కు కృతజ్ఞతలు తెలిపారు.