హైదరాబాద్ : అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్(Aranya Bhavan) లో కొత్త సంవత్సర వేడుకలు(New Year celebrations) ఘనంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది సమక్షంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్(Dobriel) కేక్ కట్ చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో మరోసారి పని పట్ల పున:రంకితం కావాలని, ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా పని చేయాలని పీసీసీఎఫ్ కోరారు.
విధి నిర్వహణలో సమయ పాలన, రాష్ట్ర వ్యాప్తంగా మరింతగా పచ్చదనం పెంపు, అటవీ రక్షణ ధ్యేయంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జూనియర్ అటవీ అధికారుల సంఘం రూపొందించిన న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్లు ఎం.సీ. పర్గెయిన్, సువర్ణ, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.