నిజామాబాద్ : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో కొనసాగుతున్న ఆటో షో ఆదివారం కూడా సందడిగా కొనసాగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, నుడా చైర్మన్ ప్రభాకర్, మేయర్ నీతు కిరణ్, ఈగ గంగారెడ్డి తదితరులు స్టాళ్లను సందర్శించారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలు వాహనాలను సరదాగా డ్రైవ్ చేశారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దంపతులు ఆటో షో లో పాల్గొని పలు వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు రకాల మోడల్ కార్లు, ద్విచక్రవాహనాలు, బ్యాటరీ వాహనాలు, మహిళలకు సౌకర్యవంతంగా ఉండే వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంచడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు.