హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామపంచాయతీల కాలపరిమితి 2024 జనవరి 31న ముగియనున్నందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్ల నియామకంపై కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నదని, దీన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలకు విధిగా ఐదేండ్లకొకసారి ఎన్నికలు జరిపి, ప్రజల చేత ఎన్నికైన పాలకవర్గాలను కొనసాగించాలని కోరారు.