రాజన్న సిరిసిల్ల, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై విచారణ జరుగుతుండగా.. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైనట్టు ప్రచారం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని సిరిసిల్ల మార్కెట్ యార్డులో నిల్వ ఉంచారు.
ఇందులో నుంచి 30 లారీల ధాన్యం మాయమైనట్టు 9వ వార్డు మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత లింగపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఇప్పటికే అపరెల్ పార్కు గోదాంలో ధాన్యం బస్తాలు మాయమైన కుంభకోణంపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పోలీసులు విచారణ చేస్తుండగా.. ధాన్యం బస్తాలు మాయమైన ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల విచారణ చేపడితే నిజానిజాలు బహిర్గతం కానున్నాయి.