హనుమకొండ : ధాన్యం సేకరణ(Grain Collection) ను, రవాణాను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli Dayakar Rao) అధికారులను ఆదేశించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులతో సోమవారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష (Reviews) నిర్వహించారు.
అకాల వర్షంతో నష్టపోయిన మండలాల్లో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు ధైర్యాన్ని కల్పించాలని సూచించారు. దెబ్బ తిన్న పంటల నష్టాలను(Crop Damage) వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. కౌలు రైతులతోపాటు, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని పేర్కొన్నారు. పంటలను ప్రభుత్వం పరంగా ఆఖరు గింజ వరకు కొనుగోలు చేయాలని వివరించారు.
రైస్ మిల్లర్లతో(Rice Millars)సమావేశాలు నిర్వహించి, కాంటాల్లో కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.సమీక్షలో వర్ధన్నపేట, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, సతీష్ బాబు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, వ్యవసాయాధికారులు ఉషాదయాళ్, డీఆర్డీవో పీడీలు శ్రీనివాస్ కుమార్, సంపత్ రావు పాల్గొన్నారు.