హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపులో రవాణా వ్యవస్థకు జీపీఎస్ ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఐకేపీ కేంద్రం నుంచి మిల్లుకు ధాన్యం తరలింపు కోసం, మిల్లు నుంచి గోదాముకు బియ్యం తరలించేందుకు ప్రతి వాహనానికి జీపీఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్ల నుంచే ఈ విధానం అమలు చేయాలని మిల్లర్లతో జరిగిన సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది.