హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్కు గురువారం వీహెచ్పీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు పండరీనాథ్, జగదీశ్వర్, పగుడాకుల బాలస్వామి, భజరంగ్దళ్ కన్వీనర్ శివరాములు, కో-కన్వీనర్ జీవన్ పాల్గొన్నారు.