హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ముగ్గురు ఐపీఎస్ (2005 బ్యాచ్)అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాశ్ మొహంతి, హైదరాబాద్ అడిషనల్ సీపీ (ఎస్బీ) పీ విశ్వప్రసాద్, డీజీపీ కార్యాలయ డీఐజీ ఎం రమేశ్రెడ్డి ఉన్నారు.