హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు దవాఖానలు అవయవాల మార్పిడి ఆపరేషన్లు చేసే స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణమని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటుతోపా టు 1,539 కిడ్నీ, 51 లీవర్, అనేక గుం డె మార్పిడి ఆపరేషన్లు జరగడం అభినందనీయమని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీలు కూడా చేయడం ఎం తో గొప్పవిషయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు, ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ స్టార్టప్లకు గొప్ప అవకాశం: కేటీఆర్
రాష్ట్రంలోని టీ-హబ్, యూఎస్కు చెందిన రెడ్బెర్రీతో కలిసి యూఎస్లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పా టు చేయనుండటంతో భారత స్టార్టప్ల కు ఎంతో మేలు చేకూరుతుందని మం త్రి కేటీఆర్ తెలిపారు. భారతీయ స్టార్టప్ లు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఇది మంచి అవకాశమని ట్వీట్ చేశారు. మన స్టార్టప్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతోపాటు యూఎస్ మార్కెట్లో భారతీయ స్టార్టప్లకు గిరాకీ ఏర్పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.