హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు ప్రభుత్వం 12 నెలల వేతనాన్ని మంజూరు చేయడంపై పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ జీవో జారీకి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్కు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్లకు కృతజ్ఞతలు తెలిపారు.